పెద్ద వయసులోనూ టీకాలు అవసరమే!
1 min read
16 నుంచి 60 ఏళ్ల వరకు తప్పక తీసుకోవాలి
సరికొత్త ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షణ
యువతలో పెరుగుతున్న అవగాహన
అన్ని వయసుల వారికీ ఇవి ఉపయుక్తం
కామినేని ఆస్పత్రి వైద్యుల సూచన
హైదరాబాద్, న్యూస్ నేడు : టీకాలు వేయించుకోవడం అనేది ప్రతి ఒక్కరికీ అవసరమేనని, పిల్లలకు చిన్నతనంలో వేయించినా.. తర్వాత పెద్ద వయసులో కూడా కొన్ని రకాల టీకాలు వేయించుకోవాల్సి ఉంటుందని కామినేని ఆస్పత్రి వైద్యనిపుణులు చెప్పారు. ప్రధానంగా కొవిడ్ తర్వాతి కాలంలో అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వాటిలోనూ కొత్త కొత్త రకాలు వస్తున్నాయని, అందువల్ల వాటన్నింటి నుంచి దీర్ఘకాలంలో రక్షణ పొందాలంటే తప్పనిసరిగా కొన్ని రకాల టీకాలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 24 నుంచి 31 వరకు అంతర్జాతీయ టీకాల వారోత్సవం సందర్భంగా ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, విభాగాధిపతి డాక్టర్ ఎం. స్వామి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ హరికిషన్, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకృష్ణ రాఘవేంద్ర బొడ్డు, కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ పటేల్ విలేఖరులతో మాట్లాడారు. ముందుగా డాక్టర్ స్వామి మాట్లాడుతూ, “పిల్లలకే కాదు.. పెద్దలకూ టీకాలు వేయించుకోవడం అవసరమే. ముఖ్యంగా కొవిడ్-19 వచ్చినప్పటి నుంచి పెద్దవారికి టీకాల ప్రాధాన్యం గురించి కొద్దిగా అవగాహన వస్తోంది. అయితే, టీకాలు వేయించుకోవడం వల్ల తమకు సమస్యలు వచ్చాయని చెప్పేవారూ లేకపోలేరు. సాధారణంగా ఇలా కేవలం టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యా రాదు. అప్పటికే వారికి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే, ఒక్కోసారి అవి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అంతేతప్ప ఈ టీకా వేసుకోవడం వల్ల వేరే సమస్య వచ్చిందని అనుకోవడం పొరపాటు. ప్రస్తుత తరుణంలో అనేక కొత్తరకాల ఇన్ఫెక్షన్లు, సమస్యలు వస్తున్నాయి. అలాగే జీవనశైలి వ్యాధుల వల్ల కొందరిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాంటప్పుడు కూడా ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఎక్కువ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ వైద్యుల వద్దకు వెళ్లి, టీకాలపై అవగాహన పొంది, తమకు ఏవేం అవసరమో అవన్నీ కాలానుగుణంగా తీసుకోవాలి” అని సూచించారు. కానీ ఇప్పుడు అలా లేదు. మధుమేహం, రక్తపోటు, గుండె సమస్యలు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారికి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అప్పుడు కొత్త ఇన్ఫెక్షన్లు వస్తాయి. అవి రాకుండా టీకాలు నిరోధిస్తాయి. అవికాక న్యుమోనియా, ఇన్ఫ్లూయెంజా లాంటి టీకాలు దాదాపు ప్రతి సంవత్సరం తీసుకోవాలి. ఎందుకంటే, ప్రతి సంవత్సరం వాటిలో కొత్త రకాల వేరియంట్లు వస్తున్నాయి. వాటిని అడ్డుకోవాలంటే కొన్ని టీకాలు ప్రతియేటా తీసుకోవాల్సిందే. అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఉదరంలో గాయమైతే కొందరికి ప్లీహం తీసేయాల్సి ఉంటుంది. నిజానికి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేది ప్రధానంగా ప్లీహమే. అది లేనప్పుడు ఇన్ఫెక్షన్లు నిరోధించాలంటే తప్పనిసరిగా కొన్ని టీకాలు తీసుకోవాలి. మనకి సమస్య రాదులే, మనకెందుకులే అని చాలామంది టీకాల మీద అంతగా దృష్టి పెట్టరు. 60 ఏళ్లు దాటిన తర్వాత పిల్లలు తమ రోగనిరోధక శక్తి తగ్గిందని చెబుతున్నారని, ఏం చేయాలని అడుగుతారు. అప్పుడు వారికి న్యూమోకోకల్, ఇన్ఫ్లూయెంజా, ఇతర టీకాలు ఇస్తుంటాం. ప్రధానంగా ప్రజల్లో అవగాహన పెరిగితేనే ఈ టీకాలు తీసుకోవడం ద్వారా వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.” అని చెప్పారు. డాక్టర్ ప్రదీప్ కుమార్ పటేల్ మాట్లాడుతూ, “మహిళల్లో పునరుత్పాదక వయసు వరకు కొన్ని టీకాలు వేస్తారు. గర్బిణులుగా ఉన్నప్పుడు మూడో నెల దాటిన తర్వాత టెట్నస్, ఎంఎంఆర్, డీపీటీ లాంటివి తీసుకోవాలి. 27 ఏళ్ల లోపు హెచ్పీవీ వ్యాక్సిన్ కనీసం ఒక డోసు తీసుకోవాలి. లేకపోతే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. తర్వాత పరిస్థితులు, లక్షణాలను బట్టి మొత్తం రెండు లేదా మూడు డోసులు ఇస్తారు. పునరుత్పాదక వయసు దాటిన తర్వాత పురుషులకు ఇచ్చే ఇతర టీకాలు వీరికి కూడా ఇస్తారు” అని వివరించారు.