నాటుసారా స్థావరాలపై దాడులు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నవోదయం కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలం ఓబులాపురం తండాలో నాటుసారా స్థావరాలపై దాడులు చేయడం జరిగింది . ఈ దాడులలో సుమారు 1600 లీటర్ల ఊట మరియు 30 లీటర్ల నాటు సారాయి ధ్వంసం చేయడం జరిగినది ఈ దాడులలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ మరియు సిబ్బంది రామలింగయ్య చంద్రపాల్ మధు రాజు మరియు ఈరన్న పాల్గొన్నారు. నాటు సారా తయారు చేయడం రవాణా చేయడం మరియు అమ్మడం చట్టరీత్యా నేరమని తెలుపుతూ ఇకమీదట నాటు సారా తయారు చేయు వారిపై పిడి చట్టం ప్రకారం శిక్షించడం జరుగుతుందని హెచ్చరిక జారీ చేయడమైనది పైన తెలిపిన బట్టి ఎవరిది అన్నది దర్యాప్తులో తెలుసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది అని తెలియజేయడమైనది.