PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యుత్ వల్ల ఎంత ఉపయోగమో.. అజాగ్రత్తగా ఉంటే అంతే ప్రమాదం

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  ప్రజలకు విద్యుత్ వల్ల ఎంత ఉపయోగమో అజాగ్రత్తగా ఉంటే అంతే ప్రమాదం అని విద్యుత్ ఏఈ గోవింద్ అన్నారు. శనివారం స్థానిక సబ్ స్టేషన్ లో విద్యుత్ వల్ల ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ష కాలం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ వైర్ల పై బట్టలు ఆరవేయడం ప్రమాదకరం అన్నారు. రైతులు కూడా మోటర్ల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

About Author