‘అమీలియో’లో అరుదైన చికిత్స
1 min read
క్రానిక్ రుమాటిక్ హార్ట్ వ్యాధితో బాధ పడుతున్న మహిళ
- సిపిబి ద్వారా.. కృత్రిమంగా గుండె వాల్స్ అమర్జిన వైద్య నిపుణులు
- 8 గంటల ఆపరేషన్ .. సక్సెస్ …
- డా.ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీతో… ఉచిత వైద్యం అందజేశాం..
- కార్డియో థొరాసిక్ వ్యాస్కులర్ సర్జన్ డా. బావాజీ కొండూరి
- వైద్యులను అభినందించిన హాస్పిటల్ ఎం.డి. డా. లక్ష్మీ ప్రసాద్ చాపే
కర్నూలు,న్యూస్ నేడు :పదేళ్లుగా గుండె నొప్పితో బాధ పడుతున్న ఓ మహిళకు… ఎనిమిది గంటలు శ్రమించి అద్బుతంగా చికిత్స చేసి ఆమె ప్రాణాలు కాపాడారు అమీలియో హాస్పిటల్ వైద్య నిపుణులు. నగరంలోని అమీలియో హాస్పిటల్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్ ఎం.డి. డా. లక్ష్మీ ప్రసాద్ చాపే తో కలిసి కార్డియో థొరాసిక్ వ్యాస్కులర్ సర్జన్ డా. బావాజీ కొండూరి వివరాలు వెల్లడించారు. దేవనకొండ మండలం పి. కౌలుట్లమ్మ (45) అనే మహిళ పదేళ్లుగా గుండె నొప్పితో బాధ పడుతోంది. వైద్య చికిత్స కోసం కర్నూలు జిల్లాలోని పలు హాస్పిటల్ లో సంప్రదించినా… ఫలితం లేకపోయింది. క్రిటికల్ కేసు కావడంతో ఆపరేషన్ చేసేందుకు ఏ హాస్పిటల్ ముందుకు రాలేదని కౌలుట్లమ్మ బంధువులు నెల రోజుల క్రితం అమీలియో హాస్పిటల్ ను ఆశ్రయించారు. క్రానిక్ రుమాటిక్ హార్ట్ వ్యాధితో కౌలుట్లమ్మ బాధ పడుతోందని గుర్తించిన ఆస్పత్రి వైద్యులు…. ఒక్కొక్కటిగా గుండె వాల్స్ మూసుకుపోతున్నాయని, వ్యాధి తీవ్రత, చికిత్స విధానం.. అందులో ఉండే ప్రమాదాన్ని క్షుణ్ణంగా వివరించినట్లు కార్డియో థొరాసిక్ వ్యాస్కులర్ సర్జన్ డా. బావాజీ కొండూరి తెలిపారు. ఇందుకు బంధువులు, బాధితురాలు కౌలుట్లమ్మ ఆపరేషన్ కు సిద్ధమని చెప్పడంతో… మే 25వ తేదీన ఎనిమిది గంటల పాటు ఆపరేషన్ చేశారు. కార్డియో పల్మనరీ బైపాస్ (సిపిబి) చేసిన తరువాత… గుండెకు మూడు వాల్స్ కృత్రిమంగా అమర్జినట్లు స్పష్టం చేశారు. ఇందుకు అనస్థియా డా. అనిల్ కుమార్, సిబ్బంది ప్రోత్సహంతోనే క్రిటికల్ కేసును ఛేదించినట్లు కార్డియో థొరాసిక్ వ్యాస్కులర్ సర్జన్ డా. బావాజీ కొండూరి పేర్కొన్నారు.
వైద్యులకు.. అభినందన
ఆధునాతన పరికరాలు… గుండెకు సంబంధించిన వైద్య నిపుణులు తమ హాస్పిటల్ లో ఉన్నందున .. ఇటువంటి ప్రమాదకర కేసును ఛాలెంజ్ గా తీసుకుని విజయం సాధించగలిగారని అమీలియో హాస్పిటల్ ఎం.డి. డా. లక్ష్మీ ప్రసాద్ చాపే. హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాలకు వెళ్తే .. అక్కడ దాదాపు రూ.7లక్షల నుంచి 10 లక్షల దాకా ఖర్చు అవుతుందని, తమ హాస్పిటల్ ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేశామని పేర్కొన్నారు. గుండెకు రంధ్రాలు పడినా… వాల్స్ మూసుకుపోయినా… తదితర గుండెకు సంబంధించిన వ్యాధులకు మెరుగైన.. వేగంగా చికిత్స అందించేందుకు గుండె వ్యాధి నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమీలియో హాస్పిటల్ ఎం.డి. డా. లక్ష్మీ ప్రసాద్ ఈ సందర్భంగా కోరారు.