NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘అమీలియో’లో అరుదైన చికిత్స

1 min read

క్రానిక్​ రుమాటిక్​ హార్ట్​ వ్యాధితో బాధ పడుతున్న మహిళ

  • సిపిబి ద్వారా.. కృత్రిమంగా గుండె వాల్స్​  అమర్జిన వైద్య నిపుణులు
  • 8 గంటల ఆపరేషన్​ .. సక్సెస్​ …
  • డా.ఎన్టీఆర్​  ఆరోగ్య శ్రీతో… ఉచిత వైద్యం అందజేశాం..
  • కార్డియో థొరాసిక్​ వ్యాస్కులర్​ సర్జన్​ డా. బావాజీ కొండూరి
  • వైద్యులను అభినందించిన హాస్పిటల్​ ఎం.డి. డా. లక్ష్మీ ప్రసాద్​ చాపే

కర్నూలు,న్యూస్​ నేడు :పదేళ్లుగా గుండె నొప్పితో బాధ పడుతున్న ఓ మహిళకు… ఎనిమిది గంటలు శ్రమించి అద్బుతంగా చికిత్స చేసి  ఆమె ప్రాణాలు కాపాడారు  అమీలియో హాస్పిటల్​ వైద్య నిపుణులు. నగరంలోని అమీలియో హాస్పిటల్​ లో సోమవారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్​ ఎం.డి. డా. లక్ష్మీ ప్రసాద్​ చాపే తో కలిసి కార్డియో థొరాసిక్​ వ్యాస్కులర్​ సర్జన్​ డా. బావాజీ కొండూరి వివరాలు వెల్లడించారు. దేవనకొండ మండలం పి. కౌలుట్లమ్మ  (45) అనే మహిళ పదేళ్లుగా గుండె నొప్పితో బాధ పడుతోంది. వైద్య చికిత్స కోసం కర్నూలు జిల్లాలోని పలు హాస్పిటల్​ లో సంప్రదించినా… ఫలితం లేకపోయింది. క్రిటికల్​ కేసు కావడంతో ఆపరేషన్​ చేసేందుకు ఏ హాస్పిటల్​ ముందుకు రాలేదని కౌలుట్లమ్మ బంధువులు  నెల రోజుల క్రితం  అమీలియో హాస్పిటల్​ ను ఆశ్రయించారు. క్రానిక్​ రుమాటిక్​ హార్ట్​ వ్యాధితో కౌలుట్లమ్మ బాధ పడుతోందని గుర్తించిన ఆస్పత్రి వైద్యులు…. ఒక్కొక్కటిగా గుండె వాల్స్​ మూసుకుపోతున్నాయని, వ్యాధి తీవ్రత, చికిత్స విధానం.. అందులో ఉండే ప్రమాదాన్ని క్షుణ్ణంగా వివరించినట్లు కార్డియో థొరాసిక్​ వ్యాస్కులర్​ సర్జన్​ డా. బావాజీ కొండూరి తెలిపారు. ఇందుకు బంధువులు, బాధితురాలు కౌలుట్లమ్మ ఆపరేషన్​ కు సిద్ధమని చెప్పడంతో… మే 25వ తేదీన ఎనిమిది గంటల పాటు  ఆపరేషన్​ చేశారు.  కార్డియో పల్మనరీ బైపాస్​ (సిపిబి) చేసిన తరువాత… గుండెకు మూడు వాల్స్​ కృత్రిమంగా అమర్జినట్లు స్పష్టం చేశారు. ఇందుకు అనస్థియా డా. అనిల్​ కుమార్​, సిబ్బంది ప్రోత్సహంతోనే క్రిటికల్​ కేసును ఛేదించినట్లు కార్డియో థొరాసిక్​ వ్యాస్కులర్​ సర్జన్​ డా. బావాజీ కొండూరి పేర్కొన్నారు.

వైద్యులకు.. అభినందన

ఆధునాతన పరికరాలు… గుండెకు సంబంధించిన వైద్య నిపుణులు తమ హాస్పిటల్​ లో ఉన్నందున .. ఇటువంటి ప్రమాదకర కేసును ఛాలెంజ్​ గా తీసుకుని విజయం సాధించగలిగారని అమీలియో హాస్పిటల్ ఎం.డి. డా. లక్ష్మీ ప్రసాద్​ చాపే. హైదరాబాద్​, బెంగుళూరు వంటి నగరాలకు వెళ్తే .. అక్కడ దాదాపు రూ.7లక్షల నుంచి 10 లక్షల దాకా ఖర్చు అవుతుందని, తమ హాస్పిటల్​ ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేశామని పేర్కొన్నారు. గుండెకు రంధ్రాలు పడినా… వాల్స్​ మూసుకుపోయినా… తదితర గుండెకు సంబంధించిన  వ్యాధులకు మెరుగైన.. వేగంగా చికిత్స  అందించేందుకు గుండె వ్యాధి నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమీలియో హాస్పిటల్​ ఎం.డి. డా. లక్ష్మీ ప్రసాద్​ ఈ సందర్భంగా కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *