నగరంలో 2.38 లక్షల మందికి యోగా శిక్షణ
1 min read
నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం నగరంలోని 137 సచివాలయాల పరిధిల్లో 2,38,192 మంది పౌరులకు, మూడు విడతల్లో ఉచిత యోగా శిక్షణ ఇస్తున్నట్లు నగరపాలక అదనపు ఆర్జీవి కృష్ణ తెలిపారు. బుధవారం బిర్లా కాంపౌండ్లోని ఖానా ఖజానా వద్ద అదనపు కమిషనర్ ‘స్ట్రీట్ యోగా’లో పాల్గొని, ఆసనాలు చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగాంధ్ర మాసోత్సవ కార్యక్రమాలను, నగరంలో పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరంలో 2,19,377 లక్షల మందిని యోగా యాప్లో నమోదు చేసి ఉచిత శిక్షణ ఇవ్వాలని ఆదేశించగా, ఆ సంఖ్యకు దాటి 2,38,192 మంది యోగా ఉచిత శిక్షణకు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. వారందరికీ ఆయా సచివాలయ పరిధిలో కార్యదర్శుల ద్వారా మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నామని, తొలి దశ ప్రక్రియ ఇప్పటికే జరుగుతుందని చెప్పారు. వారంలోగా 2.38 మందికి శిక్షణ పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా యోగా యాప్లో నమోదు చేసుకున్న వారంతా ఈ నెల 21న నగరంలో నిర్వహించనున్న మెగా యోగా డే కార్యక్రమంలో పాల్గొనాలని అదనపు కమిషనర్ కోరారు.అనంతరం లక్ష్మీపురం, ముజఫర్ నగర్ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను అదనపు కమిషనర్ అకస్మిక తనిఖీ చేశారు. హాజరు పట్టిక పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయా ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్యం అందించేందుకు కృషి చేయాలని, ఫిర్యాదులు రానీయకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ సూచించారు.కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాముడు, యోగా సంఘం కార్యదర్శి అవినాష్, తదితరులు పాల్గొన్నారు.