పలు వివాహాలకు హాజరైన ‘ఎపిఎస్ఎస్డిసిఎల్’ చైర్మన్ దంపతులు
1 min read
ప్యాపిలి, న్యూస్ నేడు: డోన్ పట్టణంలో ఎం.కన్వేషన్ నందు శైలేష్ వెడ్స్ ప్రవిత్ర గార్ల వివాహమునకు హాజరై నూతన వధూవరులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి , వారి సతీమణి మన్నే మల్లీశ్వరమ్మ ఆశీర్వదించారు, ప్యాపిలి పట్టణంలో పూజారి శివ కిషోర్ ప్యాపిలి పట్టణ టిడిపి ప్రధానకార్యదర్శి) వివాహమునకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి , అదేవిధంగా మాజీ ఎంపిపి ఆర్.ఈ.రాఘవేంద్ర , తెలుగుదేశం యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ కుమార్ రెడ్డి మరియు టిడిపి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు,డోన్ మండలం, కనపకుంట గ్రామంలో శ్రీను కుమారుడు వివాహమునకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు,డోన్ మండలం, దొరపల్లె గ్రామంలో టిడిపి నాయకులు ఈడిగ రవి నూతన గృహప్రవేశమునకు హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి మరియు తెలుగుదేశం యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ కుమార్ రెడ్డి , తెదేపా నాయకులు కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.
