‘ శ్రీ విజయ దుర్గ కార్డియాక్ ’లో.. స్టెంట్ సక్సెస్..
1 min read
రోగి గుండెకు మూడు రక్తనాళాలు పూడుకుపోయాయి..
- స్టెంట్లు వేసి.. ప్రాణాలు కాపాడిన వైద్యులు
- వెల్లడించిన హాస్పిటల్ ఎం.డి. డా. వసంత కుమార్
కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు :నగరంలోని శ్రీ విజయ దుర్గా హాస్పిటల్ లో అరుదైన చికిత్స చేసి… విజయం సాధించారు. గుండెకు సంబంధించి మూడు రక్తనాళాలు పూడుకుపోవడంతో… గుండె నొప్పితో బాధ పడుతున్న సదరు రోగి శ్రీ విజయ దుర్గా హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం చేరారు. ఆప్టికల్ కొహెరెన్స్ టోమోగ్రఫీ( ఓసీటీ) ద్వారా రోగి గుండెకు సంబంధించి మూడు రక్తనాళాలు బ్లాక్ అయినట్లు నిర్ధారించిన శ్రీ విజయ దుర్గా హాస్పిటల్ వైద్యులు.. ఒకేసారి మూడు స్టెంట్లు వేసి రోగి ప్రాణాలు కాపాడారు. శుక్రవారం హాస్పిటల్ ఎం.డి. కార్డియాక్ వైద్యులు డా. వసంత కుమార్, డా. అనిరుధ్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కర్నూలుకు చెందిన వృద్ధుడు ( 68) గత కొన్నేళ్లుగా గుండె నొప్పితో బాధపడుతూ ఉన్నాడు. మే నెలలో చికిత్స నిమిత్తం వచ్చిన ఆ వృద్ధుడి గుండెకు మూడు రక్త నాళాలు బ్లాక్ అయినట్లు ఓసీటీ విధానం ద్వారా గుర్తించారు. ఈ విధానంలో ఎక్కడ బ్లాక్ అయింది… ఎంత మేరకు ఉంది.. పొడవు, వెడెల్పు ఎంత తదితర అంశాలపై నిర్ధారణకు వచ్చారు. ఆ తరువాత ఓసీటీ విధానంలో అతడి గుండెకు మూడు వాల్వ్ లు వేసేందుకు అనుకూలంగా ఉండటంతో స్టెంట్లు వేశామని తెలిపారు. ఆధునిక పరికరాలతో… నూతన చికిత్స విధానం హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాల్లో మాత్రమే నిర్వహిస్తారని, ఇప్పుడు కర్నూలులోని తమ హాస్పిటల్లో కూడా చికిత్స చేసి… విజయం సాధించినట్లు శ్రీ విజయ దుర్గా హాస్పిటల్ అధినేత, సీనియర్ కార్డియాక్ వైద్యులు డా. వసంత కుమార్, డా. అనిరుధ్ కుమార్ వెల్లడించారు.