NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోండి

1 min read

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి సోమశివారెడ్డి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి. శ్రీకాంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ జవహర్ బాబు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు నిర్వహించే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీ శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 10 ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో పదవ తరగతి, ఐటిఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, B.Tech ,B/D/M.Pharmacy మరియు పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు పాల్గొనేందుకు అర్హులన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.  ఇతర వివారాలకు 7673902328, 9154830286 నెంబర్లకు లేదా naipunyam.ap.gov.in సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *