ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ
1 min read
త్యాగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర బక్రీద్ పర్వదినం
ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్ష
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ముస్లిం సోదర,సోదరీమణులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర బక్రీద్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ, సంతోషాలను నింపాలని ఎంపీ ఆకాంక్షించారు. ఈద్ అల్ అధా సందర్భంగా అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు ఎంపీ తెలిపారు. ప్రేమ, కరుణ, త్యాగం, సత్యం, విశ్వాసం, త్యాగం అనే బక్రీద్ సందేశాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరిస్తూ ముందుకు సాగాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకాంక్షించారు.