కర్నూలు వాసులకు యోగ భూషణ్ అవార్డులు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు జిల్లాకు చెందిన యోగ గురువులు డాక్టర్ ఎస్.ముంతాజ్ బేగం,రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టిలకు అఖిలభారత యోగ శిక్ష సంఘం జాతీయ అధ్యక్షులు మంగేష్ త్రివేది ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో అదియోగి యోగ భూషణ్ అవార్డులను ప్రకటించారు. 12 సంవత్సరాలుకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్విరామంగా యోగాలో సేవలందిస్తున్న వారికి ఈ జాతీయ వార్డు ప్రధానం చేస్తున్నట్లు మంగేష్ త్రివేది తెలిపారు. ఈ సందర్భంగా అవినాష్ శెట్టి,ముంతాజ్ బేగంలు మాట్లాడుతూ అఖిలభారత యోగ శిక్ష మహా సంఘం ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన ఢిల్లీలో అవార్డు అందుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తమను ప్రోత్సహించిన వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వాసులకు అవార్డు రావడం పట్ల రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, కర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం సీఈఓ విజయ్ కుమార్, అధ్యక్ష కార్యదర్శులు కేఈ జగదీష్ కుమార్, శ్రీనివాసులు, క్రీడా సంఘాల కార్యదర్శులు డాక్టర్ రుద్రా రెడ్డి, ఈశ్వర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.