NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విజ్ఞాన పీఠంలో అనాథ బాలుర చేరిక

1 min read

కర్నూలు,న్యూస్​ నేడు:  కర్నూలు నగర శివారు జి పుల్లారెడ్డి నగర్ లోని విజ్ఞాన పీఠం అనాధ శరణాలయంలో ఈ కొత్త విద్యా సంవత్సరంలోఈరోజు అనగా జూన్ 8వతేది ఆదివారం ఉదయం నూతన అడ్మిషన్లు ప్రారంభమైయ్యాయి. ,తల్లిదండ్రులు లేని, నిరాశ్రితులుగా ఉన్న బీద బాలుర కోసం గత 50 సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న విజ్ఞాన పీఠంలో ఈరోజు కొత్తగా 40 మంది బాలురు చేరారు. తల్లి లేక తండ్రి లేని బీద బాలుర కోసం కీర్తిశేషులు జి .పుల్లారెడ్డి దానం చేసిన స్థలంలో విశ్వహిందూ పరిషత్ ,విజ్ఞాన పీఠం అనాధ శరణాలయాన్ని దాతల సహకారంతోఈ సేవా కార్యక్రమం  గత అయిదు దశాబ్దాలుగా నిర్వహించబడుతుందని విజ్ఞానపీఠం కార్యదర్శి శ్రీ సి.మాణిక్య రెడ్డి  ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ అనాధ శరణాలయం తో పాటు ఎయిడెడ్ ప్రాథమిక , ఉన్నత పాఠశాలలు, ప్రయివేటు ఇంగ్లీష్ మీడియం పాఠశాలకూడా నడపబడుతుందని శ్రీ మాణిక్యరెడ్డి  అన్నారు. ఇంకా ఎక్కడైనా అనాధ బాలురు ఉన్నట్లయితే వారిని త్వరగా చేర్చగలరని కోశాధికారి శ్రీ రంగారెడ్డి  కోరారు .బాలురకు ఉచిత వసతి, ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి అన్ని రకాల సౌకర్యాలను అందిస్తున్నామని కూడా శ్రీ రంగారెడ్డి  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చంద్రమోహన్, శ్రీ రామ గోవిందప్ప, శ్రీ రణధీర్ రెడ్డి, శ్రీ సుదర్శన్ రావు, శ్రీమతి స్వర్ణలత, శ్రీ యస్ రామిరెడ్డి ,వంశీ రాఘవ, శ్రీనివాసులు ,నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *