రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి
1 min read
రక్త దాతలకు కృతజ్ఞతలు.. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు : రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా విజ్ఞప్తి చేశారు.శనివారం స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణంలో వైద ఆరోగ్య శాఖ, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రక్త దాత దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 14 వ తేదీన ప్రపంచ రక్త దాత దినోత్సవంగా జరుపుకుంటామన్నారు..అన్ని దానాల కంటే ప్రాణాలను నిలిపే రక్తదానం చాలా గొప్పదన్నారు.. రక్తదానం చేసిన వ్యక్తులను జూన్14 వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సన్మానం చేసుకుంటామన్నారు.. అదే విధంగా వారి సేవలకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు… రక్తదానం చేయడం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదన్నారు…ప్రపంచ రక్తదాతల దినోత్సవం థీమ్ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుందని, తమకు తెలియని వ్యక్తుల కోసం తమ రక్తాన్ని దానం చేసే నిస్వార్థ వ్యక్తులకు గుర్తింపుగా, ఈ సంవత్సరం “రక్తం ఇవ్వండి, ఆశను ఇవ్వండి కలిసి మనం ప్రాణాలను కాపాడుకుందాం” అనే థీమ్ తో ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.దేశంలో ప్రతి సంవత్సరం 5 కోట్ల మందికి రక్తం అవసరం ఉందన్నారు . బ్లడ్ డొనేషన్ కేంద్రాల ద్వారా కేవలం 3.5 కోట్లు మాత్రమే డొనేట్ అవుతుందన్నారు.. ఇంకా 1.5 కోట్లు కొరత ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.. రాష్ట్రంలో 6.5 లక్షల మందికి రక్తం అవసరం ఉంటే కేవలం 4 లక్షలు మాత్రమే డొనేట్ అవుతుందన్నారు.. కర్నూలు జిల్లాలో 45 వేలు అవసరం ఉంటే 35 వేల మాత్రమే డొనేట్ అవుతుందన్నారు.. ఆ కొరత ఉండడంతో రక్తం అత్యవసరం ఉండే వారు రక్తం దొరకక మరణించే అవకాశం ఉంటుందన్నారు..రక్తదానం చేయడం ద్వారా మనిషి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కలెక్టర్ కోరారు. ప్రజల్లో రక్తదానం మీద అవగాహన కల్పించి రక్తదానం చేసే విధంగా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు.. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారికి కలెక్టర్ జిల్లా సర్టిఫికెట్ లు అందచేశారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా.శాంతి కళ, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డా కేజీ గోవిందరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ కర్నూల్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ట్రెజరర్ రఘునాథ్ రెడ్డి,మాజీ చైర్మన్ శ్రీనివాసులు,కమిటీ మెంబర్లు,శ్రీమతి అరుణ, మధుసూదన,ప్రభాకర్ రెడ్డి,నరసింహ,భీమా శంకర్ రెడ్డి, ఎం జె.బాబురాజు,కె.వి సుబ్బారెడ్డి, మీనాక్షి,సెక్రటరీ వెంకట కృష్ణుడు,మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
