NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమ్మకు వందనం పథకంపై వైసీపీ విషప్రచారం తగదు…

1 min read

తెలుగు యువత జిల్లా కార్యనిర్వక కార్యదర్శి ఆవుల పవన్ కుమార్ రెడ్డి

న్యూస్ నేడు చెన్నూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మాట ఇస్తే ఎంతకైనా శ్రమించి ఆ మాటను నిలబెట్టుకుంటారని ప్రజల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన జీవితాన్ని త్యాగం చేశారని తెలుగు యువత జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఆవుల పవన్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం బీసీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి వేల్పుల సుబ్రహ్మణ్యం లు అన్నారు. ఈ మేరకు వారు సోమవారం చెన్నూరు లో విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతల్లికి వందనంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని తీవ్రంగా ప ఖండించారు. గత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి  అమ్మ ఒడి పథకం ద్వారా కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు. అలా చేయడం వల్ల ఆ కుటుంబంలో ఉన్న ఇద్దరు ముగ్గురు పిల్లలు చదువుకోలేక అనేక అవస్థలు పడే వారని తెలిపారు. అలాంటి తరుణంలో నారా లోకేష్ తన పాదయాత్రలో ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకొని తాము అధికారంలోకి రాగానే తల్లికి వందనం  పేరుతో కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంత మంచి విద్యార్థులకు 15 వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుందని ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది అన్నారు. ఎన్ని ఇబ్బందులు తలెత్తిన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగ లేకపోయినా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని ధ్యేయంతో నేడు పాఠశాలలు తెరచి తెరవగానే  తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయమని చెప్పవచ్చు నని వారు అన్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా నెరవేర్చడం జరిగిందని తెలిపారు. ఇక రాష్ట్రంలో వైయస్సార్సీపీకి మనుగడ ఉండదని తెలిసి తల్లికి వందనంపై అనేక అసత్య ఆరోపణలు చేయడం జరుగుతుందని తెలిపారు.  తెలుగుదేశం కార్యకర్తల కంటే ముందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తల్లికి వందనం పథకం లబ్ధి చేకూరిందని ఇలాంటి తరుణంలో  వాళ్ళ పార్టీ ఉనికి పూర్తిగా దెబ్బతినిందని ఆవేదనలో వారు ఏమి మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదన్నారు. ఆయన అన్నారు. గత ప్రభుత్వం ఇంట్లో ఒకరికే అమ్మ ఒడి ఇచ్చారన్నారు కానీ ఇప్పుడు కుటమి  ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పథకం అందిందని ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని మరొకసారి రుజువైందని వారు తెలియజేశారు. చేసే పనులు కొంచెం ఆలస్యం కావచ్చునేమో కానీ హామీలు పూర్తి చేయడం పక్కా అని వారు తెలియజేశారు.  సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా తల్లికి వందన పథకం కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలుస్తుందని ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందాన్ని గ్రహించామని వారు తెలియజేశార. అంతే కాకుండా కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి . నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అందులో భాగంగా చెన్నూరు మండలానికి కోట్ల నిధులు మంజూరు చేయించి  వివిధ అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని వారు తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *