NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగన్వాడీలకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలి

1 min read
కష్టానికి ముందు ఫలితానికి వెనక అంగన్వాడీల ఆవేదన 
పత్తికొండ, న్యూస్ నేడు : అంగన్వాడీలకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలని కోరుతూ, సోమవారం పత్తికొండ పట్టణంలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ అనుబంధ సంఘం సి ఐ టి యు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొని కష్టానికి ముందు ఫలితానికి వెనుక అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు గౌరవ అధ్యక్షులు దస్తగిరి, అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి డి. గోపాల్, సిఐటియు నాయకులు ఎం. రవిచంద్ర మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల నుండి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అంగన్వాడీలకు తీరని అన్యాయం చేస్తున్నాయని అన్నారు. ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీ ఇస్తూ, అధికారంలోకి రాగానే హామీలను విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. 2014 కంటే ముందు ఉన్న చంద్రబాబు నాయుడు అంగన్వాడి వర్కర్ మరియు హెల్పర్లకు వేతనాలు పెంచుతామని అధికారం చేపట్టిన వెంటనే వాటిని బుట్ట దాఖలు చేశారన్నారు. అధికార కూటమి ప్రభుత్వం విడుదల చేసిన సూపర్ సిక్స్ పథకాలు ఏ ఒక్కటి అంగన్వాడీలకు వర్తించకపోవడం తీరని ద్రోహం అన్నారు. సూపర్ సెక పథకాలు అంగన్వాడి ఆయాలకు కానీ టీచర్లకు కానీ వర్తించలేదని తెలిపారు. గత ప్రభుత్వం విధానాలనే నేటి కూటమి ప్రభుత్వం కూడా అమలు చేయడం ఎంతవరకు సమంజసం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎన్నికల కంటే ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అంగన్వాడిలకు వర్తింపజేసి ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని కోరారు. సూపర్ సిక్స్ పథకాలు తల్లికి వందనం ఉచిత సిలిండర్ ఇలాంటి పథకాలు ఏ ఒక్కటి అంగన్వాడీలకు వర్తించకపోవడంతో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *