NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రయివేటు పాఠశాలలో ఫిజు బోర్డులు ఏర్పాటు చేయాలి

1 min read

ఎస్ఎఫ్ఐ నాయకులు

తల్లికి వందనం ప్రతి ఒక్క విద్యార్థికి వేయాలి.ఎస్ఎఫ్ఐ

 హోళగుంద , న్యూస్​ నేడు : మండలంలోని ప్రయివేటు పాఠశాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫిజు బోర్డులు ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు మల్లికార్జున అన్నారు.అదేవిధంగా వారు మాట్లాడుతూ పాఠ్యపుస్తకాలు కూడా అధిక ధరలకు ప్రత్యేక ఫిజులు కూడా వసూలు చేస్తున్నారని,ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు అనుగుణంగా వసతులు కూడా ఏర్పాటు చేయించాలి అదేవిధంగా పాఠశాలల బస్సులు,ఇతర వాహనాలు కూడా సరియైన పిట్ నెస్ లేకుండా నడుపుతున్నారు.చిన్న చిన్న వాహనాల్లో విద్యార్థులు ఇబ్బంది పదేవిదంగా చిన్న వాహనాల్లో కూడా విద్యార్థులను తీసుకు రావడం జరుగుతుంది. ఇలా చిన్న వాహనాల్లో కాకుండా విద్యార్థులు సౌకర్య వంతంగా ఉండేలా చూడాలని అదేవిధంగా మండలంలోని ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం ఇవ్వాలి అని మండల విద్యా అధికారి సత్యనారాయణ కి భారత విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం ఆందజేయడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు సతీష్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *