NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫీజులు ఏమో లక్షల రూపాయలు… వసతులు ఏమో ఆర కోర ..?

1 min read

విద్యతో వ్యాపారం చేస్తున్న నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలను సీజ్ చేయాలనీ ధర్నా: ఏఐఎస్ఎఫ్

ఎమ్మిగనూరు , న్యూస్​ నేడు:  ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్నటువంటి నారాయణ విద్యాసంస్థలలో పుస్తకాల, యూనిఫాముల విక్రయిస్తూ  వేల రూపాయలు వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం రోజున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నారాయణ కార్పొరేట్ కళాశాల ముందు ధర్నా చేపట్టడం జరిగిందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) పట్టణ అధ్యక్ష కార్యదర్శులు విష్ణు, ఖాదర్, సహాయ కార్యదర్శి దస్తగిరి తెలిపారు ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థలు ప్రభుత్వ విధించినటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా విద్యను వ్యాపారం చేస్తూ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తల్లిదండ్రులను మోసం చేస్తూ ఐపీఎల్, ఎం పి ఎల్ అంటూ మాయమాటలతో  తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తూ అడ్మిషన్లు చేసుకుంటున్నారని, ప్రభుత్వం నిబంధనలకు ప్రకారం విద్యాసంస్థల్లో ఎటువంటి పుస్తకాలు అమ్మకూడదని ప్రభుత్వం చెపుతున్న వాటిని తుంగలో తొక్కుతూ  పుస్తకాలను ఒక్కో విద్యార్థికి 10 వేల నుంచి 22 వరకు పుస్తకాలను అమ్ముతున్నారని వారు తెలిపారు.విద్యార్థులను క్రీడల వైపు వెళ్ళకుండా యంత్రంలాగ తయారు చేస్తున్నారని మండిపడ్డారు. నారాయణ విద్యాసంస్థల విద్యా దోపిడీని అరికట్టకపోతే త్వరలోనే ఆర్ ఐ ఓ కార్యాలయం ముందు వద్ద ధర్నా కార్యక్రమం చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సమీర్, బడేసాబ్,శ్రీను, సుమంత్, ఉదయ్, భార్గవ్, సాయికుమార్, వెంకటేష్, శేఖర్,తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *