అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి ..సిఐటియు
1 min read
సిఐటియు ఆధ్వర్యంలో ఈనెల 23న కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా
జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
ప్యాపిలి, న్యూస్ నేడు: అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శి టి.శివరాం,అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు యశోద,విజయలక్ష్మి డిమాండ్ చేశారు.అంగన్వాడీల సమస్యల పరిష్కారం కొరకు ఈనెల 23న జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం అదేవిధంగా జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని వారు తెలిపారు.ఈ మేరకు శనివారం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం దగ్గర సూపర్వైజర్లు శోభారాణి,అరుణ కి సమ్మె నోటీసులు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పేద గర్భిణీలు,బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్లు,మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారన్నారు. అంగన్వాడి సెంటర్ల నిర్వహణకు రకరకాల పెట్టుబడులు పెట్టి సెంటర్లు నిర్వహిస్తున్నారని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలు మాత్రం పెరగడం లేదని అంగన్వాడీలకు కేవలం గౌరవ వేతనాలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కానీ అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు అయినందున సంక్షేమ పథకాలు అమలు కావడంలేదని తల్లికి వందనం అమలు కావడం లేదని,రిటైర్డ్ అయిన వారికి పెన్షన్ రావడంలేదని,రేషన్ కార్డు కొరకు అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు అని తిరస్కరిస్తున్నారని కావున అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా నైనా గుర్తించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలనైనా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.గ్రాట్యూటీ జీవో నెంబర్ 8ని మార్పు చేయాలని,పెన్షన్,పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని,మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని,వేసవి సెలవులు ఇవ్వాలని,అంగన్వాడి సెంటర్ల నిర్వహణకు రకరకాల యాపులు పెట్టారని కానీ ఫోన్లు సరిగా పనిచేయడం లేదని అనేక ప్రాంతాలలో నెట్ సిగ్నల్స్ ఉండడం లేదని కావున సెంటర్ నిర్వహణకు ట్యాబ్ లు ఇవ్వాలని,ఎఫ్.ఆర్.ఎస్ ను రద్దు చేయాలని,బాల సంజీవిని యాప్ లో మార్పులు చేయాలని వారు కోరారు.