ఆర్ఆర్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోండి -జై భీమ్ ఫౌండేషన్
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్థానిక ఆర్ఆర్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జై భీమ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆవుల సోమన్న ఉపాధ్యక్షులు మునిస్వామిల ఆధ్వర్యంలో శనివారం మండల విద్యాధికారులు అయిన తిమ్మారెడ్డి, రమేష్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు ఆవుల సోమన్న మాట్లాడుతూ, పత్తికొండలోని ఆర్ఆర్ ప్రవేట్ పాఠశాల ప్రభుత్వానికి విరుద్ధంగా అధిక పీజులు వసూలు చేస్తూ, అలాగే పాఠశాల ఆఫీస్ లో మతపరమైనటువంటి ఫోటోలను ఉంచి విద్యార్థులకు మతపరమైనటువంటి బోధనలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలా వ్యవహరిస్తున్న ఆర్ఆర్ ప్రవేట్ పాఠశాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే తక్షణమే పాఠశాలను సీజ్ చేయాలని అందులో కోరారు. లేని పక్షంలో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఫౌండేషన్ నాయకులు ట్రెజరర్ , బాలరాజు.హాజీ .సంతోష్. రాజు. ఫరూక్.సతీష్ .నాగేంద్ర. ఆనంద్. తదితరులు పాల్గొన్నారు.