యువత పోరుకు తరలి వెళ్ళిన వైఎస్ఆర్సిపి యువ నాయకులు
1 min read
న్యూస్ నేడు చెన్నూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన యువత పోరు కార్యక్రమానికి చెన్నూరు కు చెందిన వైయస్ఆర్సీపీ యువ నాయకులు మండల యూత్ వింగ్ అధ్యక్షులు పి నిత్య పూజయ్య ఆధ్వర్యంలో యువత భారీ సంఖ్యలో మోటార్ బైక్ లలో సోమవారం ఉదయం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ పి. నిత్య పూజ మాట్లాడుతూ, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన తనయుడు కమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పోచం రెడ్డి రామాంజుయు రెడ్డి ఆదేశాల మేరకు చెన్నూరు నుండి భారీగా బైకులలో యువత పోరుబాటకు తరలి వెళ్లడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు పీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో అటు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విద్య ,వైద్యం, వ్యవసాయ రంగాలకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. నేడు కూటమి ప్రభుత్వం వాటన్నిటిని తుంగలో తొక్కి విద్య వైద్య వ్యవసాయ రంగాలను, బ్రష్టు పట్టించడం జరిగిందన్నారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు మోపడం, వారిని జైల్లో పెట్టడమే ముఖ్య ఉద్దేశంగా పాలన సాగుతుందని ఆయన కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే రాబోవు రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా కూటమి ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. అధికారంలోకి రాకముందు అయితే ప్రజలకు హామీ ఇచ్చారో వాటన్నిటిని నెరవేర్చి దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగాలని అలాకాకుండా కక్ష సాధింపు ధోరణితో దాడులు నిర్వహిస్తే సహించబోమని రాబోవు రోజులలో కూటమి ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు టీఎన్ చంద్రారెడ్డి, మండల యూత్ వింగ్ ఉపాధ్యక్షులు రామకోటి రెడ్డి, మండల ప్రచార కమిటీ అధ్యక్షులు దేవగుడి భాస్కర్ రెడ్డి, వైయస్సార్సీపి మండల యూత్ వింగ్ కార్యదర్శి సాయినాథ రెడ్డి, వెంకటకృష్ణ సాయి పవన్ కుమార్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పార్థసారథి, బ్రహ్మయ్య, శివరాం, ఖాజా, తదితరులు పాల్గొన్నారు.