ప్రజా శ్రేయస్సుకై టిడిపి కృషి…
1 min read

హొళగుంద మండల కేంద్రంలో “సుడిగాలి” “సుపరి పాలనలో తొలిఅడుగు” కార్యక్రమం నిర్వహించిన హోళగుంద మండల టీడీపీ నాయకులు
హొళగుంద న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా…. తెలుగుదేశం పార్టీ హోళగుంద మండల కేంద్రంలో 34,35,36, బూత్ లో నాయకులు ప్రజల దగ్గరకు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రజా శ్రేయస్సుకై చేపట్టిన పథకాల గురించి వారికి వివరించి, వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకొని బూత్ ఇంఛార్జీలతో మైటిడిపి యాప్ లో అప్లోడ్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హోళగుంద మండలం టీడీపీ కన్వీనర్ వీరన్న గౌడ్, టిడిపి సీనియర్ నాయకులు ఎన్సీ శివ ప్రకాష్ (లెజెండ్), గోవింద్ గౌడ్ , జనసేనా కన్వీనర్ అశోక్ ,మాజీ మార్కెట్ చైర్మన్ పంపాపతి, వైస్ ఎంపీపీ ఎర్రీశ్వామి, సీనియర్ నాయకులు దిడ్డి వెంకటేష్, తిప్పన్న, అబ్దుల్ సుబన్, డిఎస్ భాష, రామంజి , గోవింద్, హుసేన్ పెరా, యువ నాయకులు మొయిన్, మల్లికార్జున మంజునాథ్ గౌడ్ మరియు నారా , నందమూరి అభిమానులు భారీ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.


