PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా అలంకరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో కర్నూలు శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి సందర్బంగా ఈ రోజు ప్రాతఃకాలంలో శ్రీ మహాగౌరీ అమ్మవారికి విశేష అభిషేకము, అర్చనలు జరిగినవి. మహార్నవమి సందర్భంగా మహా గౌరీ అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా అలంకరించి. మంటపారాధన దేవి ఖడ్గమాల లలితా సహస్రనామాలతో అర్చన చేయడం జరిగినది. శుక్రవారం రాహుకాల సమయంలో  మహా గౌరీ అమ్మవారి సన్నిధిలో రాహుకాల, దుర్గా పూజ, లలితా సహస్రనామ పారాయణం,  జరిగినది. అనంతరం నవ చండి హోమం ముగింపు సందర్భంగా చండీహోమం మహా పూర్ణాహుతి జరిగినది. సాయంత్రం ప్రదోష కాలార్చన షోడశోపచార పూజ లఘు శ్రీ చక్ర అర్చన శ్రీ లలితా సహస్రనామ అర్చన శ్రీ మహిషాసుర మర్దిని అర్చన నాగవల్లి దళాలతో అర్చనలు జరిగినవి. ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ప్రసాద వితరణ జరిగినది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *