ఘనంగా దళిత సేన 5వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
1 min read

దళితసేన బలహీల వర్గాల పరిరక్షింణ,సంక్షేమం అభివృద్ధికై పనిచేస్తుంది
వ్యవస్థాపక అధ్యక్షులు జుజ్జు వరకు రవి జయప్రకాష్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : దళిత సేన ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దళిత సేన రాష్ట్ర కార్యాలయం ఏలూరు నందు దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జుజ్జువరపు రవి ప్రకాష్ ఘనంగా దళిత సేన జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రవి ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల హక్కులను పరిరక్షించడమే కాకుండా వారి యొక్క సంక్షేమంకు అభివృద్ధికై దళితసేన పనిచేస్తుందని అదేవిధంగా అంబేద్కర్ జగజీవన్ రామ్ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు అనుగుణంగా దళిత సేన పనిచేస్తుందని రవి ప్రకాష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దళిత సేన ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బేతాళ జయసుధ పశ్చిమగోదావరి జిల్లా దళిత సేన అధ్యక్షులు చీలి మోహనరావు తూర్పుగోదావరి జిల్లా దళిత సేన గౌరవ అధ్యక్షులు దొండపాటి మాణిక్యాలరావు ఏలూరు జిల్లా దళిత సేన వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి లక్క పాము చంటి ఏలూరు జిల్లా కార్యదర్శి పింగళి వీధియా ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి రవికుమార్ ఏలూరు జిల్లా మహిళా కార్యదర్శి ముత్యాల ఝాన్సీ రాణి నల్లజర్ల మండల అధ్యక్షులు దొండపాటి సువర్ణ రాజు చింతలపూడి పట్టణ అధ్యక్షులు కార్తీక్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ అధ్యక్షులు దూలపల్లి సత్తయ్య తాడేపల్లిగూడెం అధ్యక్షులు ఖిలాడీ రవి గోపాలపురం గ్రామ అధ్యక్షులు భీమడోలు చంద్రయ్య మండల అధ్యక్షులు అప్పారావు కార్యదర్శి శనగల కృష్ణ అమ్మపాలెం గ్రామ అధ్యక్షురాలు పానమాల మల్లేశ్వరి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


