పంచాయతీ కార్యదర్శుల సమస్యల పై చర్చ….
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు మండల పరిషత్ సమావేశ భవనంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సంఘం కర్నూలు జిల్లా యూనిట్ సమావేశం జరిగినది. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శుల సమస్య ల పైన చర్చించడమైనది. కర్నూలు జిల్లా నూతన కార్యవర్గ సంఘమును ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశమునకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సంఘం స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ వై. హేమంత్ కుమార్ రెడ్డి హాజరైనారు. కొత్తగా ఎన్నుకోబడిన సంఘమునకు శుభాకాంక్షలు తెలియజేసి సంఘం సభ్యులకు అన్ని విధాల అందుబాటులో ఉండాలని వారి సమస్యలను అనునిత్యం పరిష్కరిస్తూ ఉండాలని తెలియజేసినారు. కర్నూల్ జిల్లా నూతన కమిటీ జిల్లా అధ్యక్షులు: పి.జగన్నాథం జనరల్ సెక్రటరీ:ఎన్. శ్రీధర్ మూర్తి అసోసియేట్ ప్రెసిడెంట్: పి.యస్.జె.సిద్దు ట్రెజరర్:కే సురేష్ వైస్ ప్రెసిడెంట్స్:1) బి సుధాకర్ రెడ్డి 2)జి లక్ష్మన్న3) టి రవికుమార్ జాయింట్ సెక్రెటరీస్:1) బి శ్రీనివాసులు 2)బి మహేష్ 3)ఎం హుస్సేన్ సాహెబ్ ఆర్గనైజింగ్ సెక్రటరీస్:1) సి అంకాలప్ప నాయుడు 2)ఎం రియాజ్ భాషా 3)బి బలరాం పబ్లిసిటీ సెక్రటరీస్ 1)ఎం సైఫుల్లా బేగ్ 2)కే సుంకన్న 3)జి రాజ్ కమల్ డివిజనల్ సెక్రటరీస్ 1)ఎల్ సురేష్ కుమార్ 2)ఎం మధు 3)పి వెంకటేశ్వర్లు ఈసీ మెంబర్స్ 1)బి జనార్ధన్ 2)ఎం రాఘవేంద్ర 3)కె అయ్యన్న.

