NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీటికుంటలో పడి ఆరుగురు చిన్నారుల మృతిపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి

1 min read

బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం

అమరావతి, న్యూస్​ నేడు : కర్నూలు జిల్లా, ఆస్పరి మండలం, చిగిలిలో ఆరుగురు చిన్నారుల మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదవ తరగతి చదువుతున్న శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మహబూబ్ అనే ఆరుగురు విద్యార్థులు ఆడుకుంటూ నీటికుంటలో పడి మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారుల మృతి వారి కుటుంబాలకు తీరని కడుపుకోతను మిగిల్చిందన్నారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు…ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

About Author