NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ వీరపాండ్యన్  చురుకైన నాయకత్వం, నిరంతర కృషి ప్రశంసనీయం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ డా. మహేశ్వర్ రెడ్డి  , హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్రీ వీరపాండ్యన్ , ఐఏఎస్​  ను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా కోవిడ్ సమయంలో ఆయన అందించిన విలువైన మార్గదర్శకత్వం మరియు సహకారానికి డా. మహేశ్వర్ రెడ్డి  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో శ్రీ వీరపాండ్యన్  చురుకైన నాయకత్వం, నిరంతర కృషి ప్రశంసనీయం అని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య సేవల అందుబాటు, నాణ్యమైన పేషెంట్ కేర్ మరియు ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల మధ్య సమన్వయంతో ఆరోగ్య రంగ అభివృద్ధి పై ఇరువురూ చర్చించారు. రాష్ట్ర “హెల్తీ ఆంధ్రప్రదేశ్” లక్ష్య సాధనలో భాగంగా ప్రజా ఆరోగ్య కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని మెడికవర్ హాస్పిటల్ మళ్ళీ నిబద్ధత వ్యక్తం చేసింది.

About Author