PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రాండ్‌ ఎంట్రీ ప్లాన్‌లో బాలయ్య..

1 min read

సినిమా డెస్క్​ : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీపై గత కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామని, అదిప్పుడు వచ్చిందని బాలయ్య అంటున్నారు. ‘ఆదిత్య 369’ చిత్రానికి సీక్వెల్‌‌ ద్వారా మోక్షజ్ఞ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని బాలకృష్ణ తెలిపారు. తాజాగా ఆ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కబోతుందన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. ‘ఆదిత్య 369’ చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా బాల‌య్య మీడియాతో ముచ్చటించారు. ఆ టైమ్‌లోఈ సినిమాకు సీక్వెల్‌ను 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. అంతేకాదు ఈ సినిమాకు ‘ఆదిత్య 999 మాక్స్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని, అయితే ఇప్పటివరకు ఈ సీక్వెల్‌కు దర్శకుడు ఫైనల్ కాలేదన్నారు. తాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చన్నారు. అయితే ఈ సీక్వెల్‌కు రెండేళ్ల సమయాన్ని తీసుకోవడం చూస్తుంటే మోక్షజ్ణ ఎంట్రీనీ భారీగానే ప్లాన్స్ చేస్తున్నారనిపిస్తోంది.

About Author