NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉంగుటూరులో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

1 min read

భవిష్యత్ తరాల కోసమే చంద్రబాబు తపన

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్

‎రాష్ట్రం కోసం కష్టపడుతున్న చంద్రబాబుకి మద్దతుగా నిలుద్దాం

గొల్లగూడెంలో పెన్షన్ల పంపిణీ, పీ4 సభల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పిలుపు

మరో 20 ఏళ్లు కూటమి ప్రభుత్వమే ఉండాలి

సీఎం సహకారంతో ఏలూరు అభివృద్ధికి బాటలు

చింతలపూడి ఎత్తిపోతలు, కొల్లేరు, జంగారెడ్డిగూడెం రోడ్డు, ఏలూరు పట్టణంలో డ్రైనేజీ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఏలూరు ఎంపీ.

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళుతున్న ముఖ్యమంత్రికి ప్రజలంతా మద్దతుగా నిలవాల్సిన  అవసరం ఉందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.  సోమవారం ఉంగుటూరు మండలంలో  జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, పీ4 సభల్లో ముఖ్యమంత్రితో పాటు పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గొల్లగూడెం ప్రజావేదిక సభలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు, ఉద్యోగులు, యువత సహా అన్ని వర్గాల ప్రజలూ స్వేచ్ఛ, సంతోషాలతో ఊపిరి పీల్చుకుంటున్నారనటంలో సందేహం లేదన్నారు. తాను ఎంతో అభిమానించే నేత చంద్రబాబు అన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఈ ఏడాది పొగాకు, పామాయిల్, ఆక్వా రైతులకు మంచి ధర ఇప్పించగలిగామన్నారు.పొగాకు రైతులకు  అత్యధికంగా కేజీకి రూ. 460, ఆయిల్ పామ్ కు క్వింటాలుకు 19,000 పైగా ధర లభించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న చర్యలే కారణమన్నారు. ఆలాగే కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఆక్వా రైతులు సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపుతున్న ముఖ్యమంత్రికి, మంత్రి నారా లోకేష్ కి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరు పార్లమెంటు పరిధిలోని కొన్ని ప్రధాన సమస్యలను, ప్రజల కోరికలను, సమస్యలను పుట్టా మహేష్ కుమార్ ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించారు. ముఖ్యంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పిన ఎంపీ,  ఏలూరు- జంగారెడ్డిగూడెం రోడ్డు జాతీయ రహదారిగా విస్తరించవలసిన అవసరాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఏలూరు పట్టణ ప్రజల చిరకాల కోరికగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు డిమాండ్ ను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకువెళ్లారు.

‎అంతకు ముందు ఉదయం 11.00 సమయంలో గొల్లగూడెం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం  పలికారు.  ముఖ్యమంత్రి పర్యటనలో ఎమ్మెల్యేలు పత్సమట్ల ధర్మరాజు, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు, డా. కామినేని శ్రీనివాస్, ఏపి అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఐజి అశోక్ కుమార్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్,  ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, డిసిఎంఎస్ చైర్మన్ మురళీకృష్ణ, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఏపి భవన నిర్మాణ కార్మిక, ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు  చైర్మన్ వలవల బాబ్జీ, మాజీ శాసనసభ్యులు ఘంటా మురళీ రామకృష్ణ ఇతర నేతలు పాల్గొన్నారు.

About Author