ప్రభుత్వ బడి… బంగారు భవిష్యత్తుకు పునాది
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్యాపిలి పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల( కిందిగేరి) లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వం పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాల గురించి పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఉపాధ్యాయులు చేస్తున్న కృత్యాధార బోధన గురించి అన్ని విషయాలను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. తల్లిదండ్రులు స్పందించి ఎనిమిది మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించరని వారు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మీ, హరినాథ్ రెడ్డి , గురువర్ధిని, వెంకటేశ్వర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


