ఘనంగా ఆలూరు టీడీపీ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి జన్మదిన వేడుకలు
1 min read
హొళగుంద. న్యూస్ నేడు : హొళగుంద మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ఆవరణలో ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని స్థానిక నాయకుడు చిన్నహ్యట శేషగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి వైకుంఠం జ్యోతి చిత్రపటానికి పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో రాజా పంపన్న గౌడ్, యువ నాయకుడు అశోక్, మండల కన్వీనర్ తిప్పయ్య, మురళి తదితరులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, టీడీపీ శ్రేణులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, వైకుంఠం జ్యోతి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ, ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి అభిమానాన్ని సంపాదించుకున్న నాయకురాలిగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు.అనంతరం వైకుంఠం జ్యోతి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

