PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్తమ సేవకు.. అత్యుత్తమ గుర్తింపు…

1 min read

డా. చంద్రశేఖర్​కు జీవన సాఫల్య పురస్కారం అందజేసిన విశ్రాంత ఐఏఎస్​  అధికారి అజయ్​మిశ్రా

పల్లెవెలుగు: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అత్యవసర చికిత్స చేసి.. ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచిన కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​కు జీవన సాఫల్య పురస్కారం వరించింది.  కొన్నేళ్లపాటు కార్డియాలజిస్ట్​గా విధులు నిర్వహిస్తున్న డా. చంద్రశేఖర్​ ఉత్తమ సేవలను గుర్తించి… ఎన్జీఓ ఆర్గనైజేషన్​ ఆధ్వర్యంలో ఆయనకు లైఫ్​ టైమ్​ అచీవ్​మెంట్​ అవార్డు అందజేశారు. ప్రపంచల వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని శనివారం హైదరాబాద్​లోని హై టెక్స్​ ఎగ్జిబిషన్​ సెంటర్​లో జరిగిన కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్​ అధికారి అజయ్​ మిశ్రా, డా. మారుతి ఈ పురస్కరాన్ని అందజేసి..అభినందించారు.

  • కర్నూలు జిల్లాకు గర్వకారణం..
  • రాయలసీమ జిల్లాలతోపాటు రాయచూరు, మహబూబ్​నగర్​ ఉమ్మడి జిల్లాల నుంచి వివిధ వ్యాధులతో  చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి వస్తారు. గుండెకు సంబంధించిన వ్యాధులకు మాత్రం కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​ రోగులకు ఉత్తమ సేవ అందించారు.  డా. చంద్రశేఖర్​ ఉన్నారంటే… ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన రోగి గుండె సేఫ్​ ..అని ప్రజలు బాహాటంగా చెబుతారు. వైద్య సేవలను గుర్తించి… లైఫ్​టైమ్​ అచీవ్​మెంట్​ అవార్డు దక్కించుకొని.. కర్నూలు జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చారని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు  కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​కు అభినందనలు తెలిపారు.

About Author