NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చెట్లను నరకవద్దు..పెంచడమే ముఖ్యం

1 min read

పర్యావరణాన్ని కాపాడుకుందాం.. జిల్లా కలెక్టర్ రాజకుమారి

మిడుతూరు, న్యూస్​ నేడు:  చెట్లను నరకవద్దు చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం’అనే ఇతివృత్తంతో ప్రభుత్వ చొరవ కార్యక్రమంలో భాగంగా నంద్యాలలోని నూనేపల్లి మున్సిపల్ హైస్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి హాజరయ్యారు.వీరికి పాణ్యం ఏపీ మోడల్ పాఠశాల విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ ద్వారా ఘన స్వాగతం పలికారు.జిల్లా కమిషనర్ స్కౌట్స్ మరియు జిల్లా విద్యాశాఖాధికారి పి.జనార్ధన్ రెడ్డి మార్గ దర్శకత్వంలో ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా చెట్ల పెంపకం యొక్క ప్రాముఖ్యత, పర్యావరణాన్ని కాపాడటం, ప్లాస్టిక్ నిషేధం వంటి వాటి గురించి మంత్రి కలెక్టర్ వివరించారు.పాణ్యం మోడల్ పాఠశాల విద్యార్థులను కలెక్టర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో అధికారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *