PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం: ఈవో ఆర్డి

1 min read

పల్లెవెలుగు వెబ్​, మిడుతూరు: మండలంలోని తలముడిపి గ్రామ సచివాలయంలో 72వ భారత రాజ్యాంగం ఆమోదిత దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు  ఈవో ఆర్డి పుల్లయ్య,  గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను  ఈ సందర్భంగా కొనియాడారు. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం. ప్రస్తుతం సచివాలయ వ్యవస్థ ద్వారా వివిధ సంక్షేమ పథకాల అమలు రాజ్యాంగ స్ఫూర్తి అని ఇందుకు కారకులైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  కృషిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శాలు బాషా సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

About Author