NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎల్లార్తి ఊరుసు వాల్ పోస్టుర్ విడుదల

1 min read

హొళగుంద న్యూస్ నేడు : జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఎల్లార్తి శేక్షావలి షాషావలి సాహెబ్ ల 363 వ ఉర్సు కు సంబంధించిన వాల్ పోస్టర్ లను  నంద్యాలలో     రాష్ట్ర మైనారిటీ  సంక్షేమ శాఖ  మంత్రి ఎన్. ఎం.డి.ఫరూక్  చేతుల మీదుగా విడుదల చేసినట్లు ఎల్లార్తి దర్గా ఈఓ ఇమ్రాన్, టీడీపీ సీనియర్ నాయకుడు ఈడిగ గోవింద్ గౌడ్, టీడీపీ యువ నాయకుడు ఈడిగ రాజేంద్ర గౌడ్, టీడీపీ మండల్  కన్వీనర్  వీరన్న గౌడ్, దర్గా నిర్వాహకుడు షాపిర్ ఖాన్   గురువారం తెలిపారు.  గంధం 18/09/2025,  ఊరుసు 19/09/2025,  జీయరత్ 20/09/2025 ఉంటుందని తెలిపారు.భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చి సాహెబ్ వారిని దర్సించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సిబిఎన్ ఆర్మీ ము ముల్లామొయిన్, బంధప్ప, దిడ్డి నాగప్ప, డబ్బే ఎల్లప్ప, మల్లయ్య పాల్గొన్నారు.

About Author