NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యోగాభ్యాసన ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో భాగంగా చేసుకోవాలి

1 min read

యోగాంధ్ర కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు భాగస్వాములు కావడం ఆనందదాయకం

యోగాభ్యాసనలో ట్రైనర్లు పూర్తి శిక్షణ అందిస్తారు

యోగా ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి-జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు :  జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున భాగస్వాములు కావడం ఎంతో ఆనందదాయకమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. 11 అంతర్జాతీయ యోగా దినోత్సవం ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర (మే 21 నుండి జూన్ 21 వరకు) అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏలూరు సి ఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు నిర్వహించిన భారీ ర్యాలీ లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు లతో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే యోగాభ్యాసనను ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. జూన్, 21 వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా   యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మే,21వ తేదీ నుండి జూన్,21 వ తేదీ వరకు నెలరోజులపాటు జిల్లాలోని గ్రామ,మండల, పట్టణ,నగర ప్రాంతాలలో  పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమాలలో ప్రజలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొంటున్నారని, ఇదే స్పూర్తితో ప్రజలు యోగాంధ్ర కార్యక్రమం తరవాత కూడా  యోగాభ్యాసనను ప్రతీ రోజు చేయాలన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్  ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ యోగా ద్వారా ఎన్నో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, ప్రతీ ఒక్కరూ యోగాభ్యాసన చేయాలన్నారు. ఏలూరు శాసనసభ్యులు  బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల పిలుపు మేరకు రాష్ట్రంలోని 2 కోట్ల మందికి పైగా ప్రజలు యోగాభ్యాసన  కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా నెల రోజులపాటు  మే, 21 వ తేదీ నుండి  జూన్, 21 వతేదీ వరకు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రజలు, అధికారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు యోగాభ్యాసం కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు.    యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి ఎంతో నూతన ఉత్సాహాయంతో ఉంటారన్నారు.  ప్రతీ ఒక్కరో జీవితంలో యోగ ఒక భాగం కావాలన్నారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించేందుకు అంగీకరించారని, ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి కూడా పాల్గొనడం ఎంతో గొప్ప విషయమన్నారు. యోగాభ్యాసన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం పెరుగుతుందని, కావున ప్రజలందరూ ట్రైనర్ల ద్వారా యోగాలో శిక్షణ తీసుకుని ప్రతీరోజు యోగాభ్యాసం చేయాలన్నారు. అనంతరం ఇండోర్ స్టేడియం లో నిర్వహించిన యోగ ఆసనాల కార్యక్రమంలో   కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), మేయర్ నూర్జహాన్ పెదబాబు, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత యోగ గురువు ధర్మారావు యోగ విశిష్టతను వివరిస్తూ వివిధ ఆసనాలను వేసే పద్ధతిని నేర్పుతూ ఆ ఆసనాల ప్రాముఖ్యతను సవివరంగా తెలియజేసారు.ఈ కార్యక్రమంలో  ఏయం సి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి,కార్పొరేషన్ కో- ఆప్షన్ మెంబర్ ఎస్.యం ఆర్ పెదబాబు,జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్,పలువురు కార్పొరేటర్లు,ప్రజా ప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు, మహిళలు,విద్యార్థులు,పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *