PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మా భూములకు నష్టపరిహారం ఇవ్వండి..

1 min read

– పరిశ్రమ వద్ద బాధితుల ధర్నా..

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  మండల పరిధిలోని బిలకలగూ డూరు గ్రామ సమీపంలో నిర్మించిన జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీలో భూముల కోల్పోయిన వారికి పరిహారం అందించక పోవడంతో ఫ్యాక్టరీలోని మైనింగ్ వద్ద బాధిత రైతు కుటుంబ సభ్యులతో కలసి రెండో రోజు బుధవారం అందోళన నిర్వహించారు. బిలకల గూడూరు గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ బాషా, వెంకటసుబ్బయ్య, బాలనాగన్న, ఆనందం, చిన్న సుబ్బన్నలకు చెందిన పొలాన్ని జిందాల్ సిమెం ట్ ఫ్యాక్టరీకి తీసుకున్నారు. మైనింగ్ వద్ద కుటుంసభ్యులతో కలిసి రహదారికి రాళ్లను అడ్డం పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కొన్నేళ్ల నుంచి తిరుగు తున్నా పరిహారం ఇవ్వలేదని వాపోయారు. పరిహారం ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు.

About Author