NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీకి మరోసారి అవకాశం ఇవ్వండి..

1 min read

సంక్షేమ పథకాలు అమలవుతాయి…

  • 4శాతం రిజర్వేషన్​  కొనసాగుతుంది
  • వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్​
  • టీడీపీ వీడి వైసీపీలో చేరిన 1200 మంది

కర్నూలు, పల్లెవెలుగు:కర్నూలు నియోజకవర్గం 6వ వార్డ్ కు చెందిన  ఉస్తాద్ మహమ్మద్ అలీ అధ్యక్షతన ఇబ్రహీం, ఉస్మాన్, షేక్షా, మహబూబ్ బాషా మరియు వారి మిత్రబృందం సుమారు 1200 మందితో టిడిపిని వీడి వైసీపీలో చేరడం జరిగింది. వీరిని సాదరంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కర్నూలు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాలు మనకు అందిన ప్రతి సంక్షేమ పథకం మళ్ళీ మనకు అందాలి అంటే మరలా వై యస్ ఆర్ సీ పీ అధికారంలోనికి రావాలి అని, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని మరీ ముఖ్యంగా ముస్లిం లకు 4% రిజర్వేషన్ కొనసాగాలి అంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని కాబట్టి కర్నూలు ప్రజలు అలోచించి ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఇంతియాజ్ గారు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే sv మోహన్ రెడ్డి గారు, వైసిపి సీనియర్ నాయకులు అహ్మద్ అలీ ఖాన్ గారు, మోహిత్ ఖాన్ గారు వైసిపి కార్పొరేటర్లు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author