ఘణంగా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ బి.లీలా వెంకట శేషాద్రి ఈ రోజు అనగా 20-02-2026 న స్థానిక అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ , దుపాడు నందు ప్రపంచ సామజిక న్యాయ దినోత్సవాన్ని ఘణంగా నిర్వహించారు . జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి మాట్లడుతు సామాజిక న్యాయాన్ని ఆ కాoక్షి స్తూ ఫిబ్రవరి 20 న ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు . అనంతరం సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ పై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు జడ్జి చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ యన్. మగేశ్వరి , వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ యస్. ఎ. శివకుమార్, అడ్మినిస్ట్రేటర్ దావల్ ఈశ్వర్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వలి, కాలేజీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

