కోడుమూరులో.. ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం
1 min read
ఆదోని, న్యూస్ నేడు: హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా కోడుమూరు పట్టణంలో చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మాజీ మండల అధ్యక్షులు షణ్ముఖమాచారి మరియు సల్వాడి సురేంద్ర విశ్వహిందూ పరిషత్ ఆదోని జిల్లా విశేష సంపత్ కర్ణం మల్లికార్జున రెడ్డి సమరసత సేవా ఫౌండేషన్ కోడుమూరు కండ ధర్మ ప్రచారక్ ముడుమలకుర్తి శ్రీనివాసులు శ్రీనివాసులు విశ్వహిందూ పరిషత్, హైందవశక్తి, సభ్యులు మరియు శరఫ్ బజారు లోని హిందు బంధువులు పాల్గొన్నారు కార్యక్రమంలో ముఖ్య అతిధి గా హైందవ శక్తి జిల్లా కన్వీనర్ సల్వాడి సురేంద్ర పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సురేంద్ర మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక, హిందూ సమాజం కోసం గొప్ప పాలనా విధానాన్ని ప్రవేశపెట్టిన సమర్ధత కలిగిన మన శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగిన జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం అని తెలిపారు అలాగే శివాజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.