రేషన్ బియ్యం తీసుకోకపోతే.. డబ్బులు !
1 min read

పల్లెవెలుగువెబ్ : రేషన్ బియ్యం వద్దంటే డబ్బులిస్తామని మంత్రి నాగేశ్వరరావు అన్నారు. ప్రజలు బియ్యం వద్దు.. నగదు కావాలంటే డిక్లరేషన్ తీసుకుంటామని మంత్రి తెలిపారు. నగదు వారి అకౌంట్లో జమ చేస్తామని మంత్రి నాగేశ్వరరావు పేర్కొన్నారు. మళ్ళీ రేషన్ బియ్యం కావాలన్నా ప్రజలకు ఇస్తామని మంత్రి నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

