ఇంటర్ పరీక్షలకు… ఏర్పాట్లు సిద్ధం
1 min read
నిమిషం ఆలస్యమైతే… నో ఎంట్రీ…
- ఆర్ఐఓ గురువయ్య శెట్టి
కర్నూలు, న్యూస్నేడు:శనివారం జరిగే ఇంటర్ మీడియేట్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఐఓ గురువయ్యశెట్టి తెలిపారు. శుక్రవారం తన ఛాంబరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. సెంటర్లలో తాగునీరు, వైద్యం, ఫ్యాన్లు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించామన్నారు. విద్యార్థులు ఎవరూ నేలపై కూర్చొని పరీక్ష రాసే అవకాశం లేకుండా… అన్ని కేంద్రాలలో ఫర్నీచర్ ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే అన్ని పరీక్ష కేంద్రాలను పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు. నిమిషం ఆలస్యమైతే.. పరీక్ష కేంద్రాలకు అనుమతించేది లేదని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సమయానికి రావాలని ఈ సందర్భంగా ఆర్ఐఓ గురువయ్య శెట్టి సూచించారు. పరీక్ష కేంద్రాలను డీవీఈఓ పరమేశ్వర రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ లాలప్ప పర్యవేక్షిస్తారన్నారు. జిల్లాలో 7 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించామని, ఫ్లయింగ్ స్క్వాడ్ మూడు, సిట్టింగ్ స్క్వాడ్ 6 బృందాలను ఏర్పాటు చేశౄమన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఏమైనా సమస్యలు వస్తే జిల్లా కంట్రోల్ రూమ్ నెం. 08518–222047 ను సంప్రదించాలన్నారు.