సంయుక్తంగా నాషా ముక్త భారత్ అభయాన్ కార్యక్రమం
1 min read

మాధక ద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం,ర్యాలీ
పెద్ద సంఖ్యలో పాల్గొన్న వివిధ ప్రభుత్వ అధికారులు, కళాశాల విద్యార్థిని విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు
పాల్గొన్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే, జడ్పీ చైర్ పర్సన్, ఎక్సైజ్ అధికారులు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఉత్తర్వులను పురస్కరించుకుని ఏలూరు జిల్లావ్యాప్తంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణ పై అవగాహన కార్యక్రమం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు,జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వి ఐఏఎస్ వారు, జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి ఐఏఎస్ వారు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమమును అన్ని స్కూళ్ల యొక్క విద్యార్థిని విద్యార్థులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినారుఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి మాట్లాడుతూ ఇంత మంది విద్యార్థిని విద్యార్థులను ఒకే చోట చూడడం చాలా ఆనందంగా ఉందని, మత్తు పదార్థాల వలన కలిగే అనర్ధాలను గురించి మరియు మత్తుపదార్థాలకు అలవాటు పడితే ఆ కుటుంబాలు మరియు ఆ విద్యార్థులు వారి యొక్క బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటారని కావున డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం ద్వారా మత్తు పదార్థాల వలన కలిగే అనర్ధాలను గురించి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించడం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రతి ఒక్కరూ కూడా డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, తెలియ చేసినారు.ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగేటటు వంటి అనర్ధాలను గురించి అవగాహన కల్పించడం వలన విద్యార్థిని విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటారు అనే ఉద్దేశంతో డ్రగ్స్ వలన కలిగేటటువంటి అనర్ధాలను గురించి తెలియ చేస్తూ విద్యార్థులు విద్యను అభ్యసించే సమయంలో డ్రగ్స్ కు బానిసలు కాకుండా వారి యొక్క బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుల కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి యొక్క ఆదేశాలపై జిల్లా పోలీసు, కలెక్టర్ గారు అనేక రకములైనటువంటి చర్యలను తీసుకుంటున్నామని దీనిపై డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని నిర్వహించామని డ్రగ్స్ అక్రమ రవాణా దారులపై ఇప్పటికే ఏలూరు జిల్లాలో 20 కేసులు నమోదు చేసినట్లు, సుమారు 700 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకుని సదరు కేసులలో 40 మంది ముద్దాయిలను అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు ఎవరైనా మీ చుట్టు ప్రక్కల డ్రగ్స్ అమ్మకాలు జరిపితే 1972 కి లేదా డయల్ 112 కు వాట్స్ అప్ నెంబర్ 9550351100 కి సమాచారం సమాచారం అందించిన ఎడల మత్తు పదార్థాల అమ్మకాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు,ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసైతే అట్టి వారిని డి అడిక్షన్ సెంటర్ ద్వారా మత్తు పదార్థాలు సేవించకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు, ఈ కార్యక్రమం అనంతరం ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుండి విద్యార్థిని విద్యార్థులతో సుమారు 2000 మంది విద్యార్థిని విద్యార్థులను అందరూ కలిసి ర్యాలీని పోలీస్ పెరటి గ్రౌండ్ నుంచి అమీనాపేట గవర్నమెంట్ హాస్పిటల్ మరియు ఫైర్ స్టేషన్ సెంటర్ నందు కొరకు ర్యాలీను నిర్వహించి ఈ ర్యాలీలో విద్యార్థిని విద్యార్థులు డ్రగ్స్ వలన కలిగేటటువంటి అనర్ధాలను గురించి స్లోగన్స్ ఇచ్చినారు. డ్రగ్స్ వద్దు అనే కార్యక్రమాలను గురించి ప్రతిజ్ఞను విద్యార్థిని విద్యార్థులు మరియు అధికారులు నిర్వహించినారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అండ్ సూర్యచంద్రరావు,ఏలూరు డిఎస్పి డి శ్రావణ్ కుమార్, డిటిసి డిఎస్పి ప్రసాద్, ఎస్.బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వర రావు, ఏఆర్ డిఎస్పి చంద్రశేఖర్, ఆర్ఐ పవన్ కుమార్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ హబీబ్ భాషా, ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ,ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, ఏలూరు త్రి టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, పోలీసు అధికారులు మరియు ఎక్సైజ్ అధికారులు, పోలీస్ అధికారులు అన్ని స్కూల్ లు కాలేజీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


