కర్నూలు 3వ పట్టణ పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
1 min read
మహిళల భద్రత పై ప్రత్యేక దృష్టి సారించాలి
పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరంలోని కర్నూలు మూడవ పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.పోలీసు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. పోలీసులకు తగిన సూచనలు, సలహాలు చేశారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.సీజ్ చేసిన వాహనాలను త్వరగా డిస్పోజ్ చేయాలన్నారు.పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎవరైనా సమస్యల పట్ల పోలీసుస్టేష న్ ను ఆశ్రయించినప్పుడు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. జిల్లా ఎస్పీ వెంట కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్ , కర్నూలు మూడవ పట్టణ పీఎస్ సిఐ శేషయ్య, ఎస్సై మన్మధ విజయ్ ఉన్నారు.
