PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుండెపోటుతో కర్నూలు మార్కెట్​ యార్డు డైరెక్టర్​ మృతి

1 min read
భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే

భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు మార్కెట్​ యార్డు డైరెక్టర్​, వైసీపీ యువనేత సాంబశివా రెడ్డి (36)ఆదివారం తెల్లవారు జామున గుండె పోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైసీపీ నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి, వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి రియల్​ టైం నాగరాజు యాదవ్​, వైసీపీ కార్యకర్తలు, నాయకులు సాంబశివ రెడ్డి స్వగృహానికి వెళ్లి.. బౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే సాంబశివారెడ్డి… కార్పొరేషన్​ ఎన్నికల్లో అత్యధిక సీట్లు వైసీపీ కైవసం చేసుకోవడానికి కీలక పాత్ర పోషించారని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అనంతరం సాంబశివారెడ్డి సతీమణి మమత, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి వెంట.. షరీఫ్, రమణ, రాఘవేంద్ర నాయుడు, కంటూ, సర్వేశ్వర రెడ్డి, లాజర్, శేఖర్ ఎస్వి యూత్ పాల్గొన్నారు.

About Author