PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CMRF చెక్కులను అందజేసిన కర్నూల్ ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు అన్నారు. కర్నూలు నగరంలోని ఎమ్మెల్యే గారి కార్యాలయం లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లను పంపిణీ చేశారు. 17 లక్షల 55వేల రూపాయల చెక్ లను ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 3వేలు పైగా వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా వుందంటే అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు,1వ వార్డ్ కార్పొరేటర్ షాషా వాలి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About Author