PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ హైకోర్టు ఛీఫ్​జస్టిస్​గా ప్రశాంత్​కుమార్​ మిశ్రా ప్రమాణస్వీకారం!

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్​​ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ ప్రశాంత్​కుమార్​ మిశ్రా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈమేరకు రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషన్​ హరిచందన్​ హైకోర్టు నూతన సీజే జస్టిస్​ ప్రశాంత్​కుమార్​ మిశ్రాచే ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్​.జగన్​, రాష్ట్ర మంత్రులు బొత్ససత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్​, పలువరు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. కాగా జస్టిస్​ ప్రశాంత్​కుమార్​ మిశ్రా 2004, జూన్‌ 26 నుంచి 2007, ఆగస్టు 31 వరకూ రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. అలాగే 2007, సెప్టెంబర్‌ 1 వరకూ అడ్వొకేట్‌ జనరల్‌గా కొనసాగారు. 2009, డిసెంబర్‌ 10న ఛత్తీస్‌గఢ్‌ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న ఆయనను.. తాజాగా ఏపీ హైకోర్టు సీజేగా కేంద్రం నియమించింది.

About Author