పైప్ లైన్ సమస్యను వెంటనేపరిష్కరించాలని వినతి
1 min read
7వ వార్డు కాలనీ వాసులు మరియు ఎస్ డి పి ఐ కార్యకర్తలు
హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద గ్రామంలో 7వ వార్డు నంద మా కాలనీ లో నీటి సమస్య ఎక్కువగా ఉంది.అందువలన వెంటనే మా కాలనీ లో గల గోపాల్ రెడ్డి పాత లైన్ పైపులైను గత 30 సంవత్సరాల కిందట వేసినది కావున ఈ పైపులైను లో వెర్లు పోయి నీళ్ళు సరిగ్గా రావడం లేదు. ఈ వెర్లను ఎన్ని సార్లు తీసిన అలాగే వస్తున్నాయి. గత నెల రోజుల నుండి మాకు నీళ్ళు అందలేదు. అందువలన ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి కూర్చున్నాము అలాగే సినిమా థియేటర్ దగ్గర నుంచి శాలి క్వార్టర్స్ దాక మరియు సచివాలయం ఎదురుగా నుండి వార్డు మెంబర్ రవి ఇంటి దాక ఈ కొత్త పైపులైను వేయించాలని కాలనీ వాసులు మరియు ఎస్ డి పి ఐ కార్యకర్తలు కోరారు ఈ కార్యక్రమంలో 7 వ వార్డ్ బ్రాంచ్ అధ్యక్షులు కె.జావిద్ భాష, కార్యదర్శి సైఫుల్ల, కాలనీవాసులు చంద్రశేఖర్ ,సులేమాన్, ఫయాజ్ ,ముజీబ్,జామిల్ తదితరులు పాల్గొన్నారు.