హిందూ స్మశాన వాటిక భూ ఆక్రమణ సమస్యలపై “సమీక్ష సమావేశం
1 min read
స్మశాన వాటిక భూమి మీద 30 అడుగుల రోడ్డు వెంటనే రద్దు పరచాలి ఎమ్మెల్యే
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో స్మశాన వాటిక భూమి మీదుగా ప్రైవేట్ వ్యక్తులకు రహదారి ఏర్పాటుకొరకై ఆమోదించిన తప్పుడు తీర్మానం రద్దు కోరుతూ.. కలెక్టర్ కు సిఫారసు లెటర్ వెంటనే పెట్టాలంటూ…స్మశాన వాటికలో అత్యవసర మౌలిక వసతులను ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించిన.. ఎమ్మెల్యే. బి.వి.జయనాగేశ్వర రెడ్డి ఎమ్మిగనూరు పట్టణంలో హిందూ రుద్ర స్మశాన వాటిక భూమి సర్వేనెంబర్ 183/బి. మీదుగా ప్రైవేట్ వ్యక్తులకు రహదారి ఏర్పాటు కొరకై ఆమోదించిన తప్పుడు తీర్మానం నెంబర్ 485 పైన మరియు స్మశాన వాటిక భూమి ఆక్రమణలకు సంబంధించిన అంశాలపైన గత ఆదివారం హిందూ స్మశాన వాటిక భూమి దగ్గరకు వచ్చి వాస్తవ పరిశీలన చేసిన గౌరవనీయులైన మన స్థానిక ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వర రెడ్డిగారి ఆధ్వర్యాన స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి సమక్షంలో హిందు రుద్ర స్మశాన వాటిక పరిరక్షణ కమిటీ నాయకులైన లచ్చన్న,గణేష్, కొండయ్య,వడ్డే బజారి,పాండురంగ స్వామి, వాల్మీకి రామకృష్ణ, రామకృష్ణ, బుడుగు జంగాల పెద్దయ్య, జగ్గాపురం చిన్న ఈరన్న,నారాయణ, టీ స్టాల్ చంద్ర, మంగళ గిడ్డయ్య, రామస్వామి, మెకానిక్ బీరప్ప లతొ కలసి హిందూ స్మశాన వాటిక భూమి ఆక్రమణ సమస్యలపై “సమీక్ష సమావేశం” నిర్వహించడం జరిగింది.ఈ సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ… స్మశాన వాటిక భూమి మీదుగా రహదారి కొరకు చేసిన తీర్మానం రద్దు కోరుతూ..కలెక్టర్ కి సిఫారసు లెటర్ ను వెంటనే పంపాలని కమిషనర్ ని ఆదేశించారు.స్మశాన వాటిక భూమిలో ఉన్న ప్రస్తుత ఆక్రమణలను వెంటనే తొలగించి,భవిష్యత్తులో స్మశాన భూమి పరిరక్షణ నిమిత్తం స్మశాన వాటిక స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని, అలాగే స్మశాన భూమి సర్వే నెంబర్లతో కూడిన స్కెచ్ ను కనబరుస్తూ.. అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయటం మరియు గ్రీన్ ప్యాచ్ ఏర్పాటు మొదలైన అత్యవసర మౌలిక వసతులను ఏర్పాటు చేయుటకు తగు చర్యలు వెంటనే తీసుకోవాలని కమిషనర్ ని ఆదేశించడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు మరియు పరిరక్షణ సమితి నాయకులు ఉరుకుందు, యాపిలయ్య, వెంకటేష్, నాగరాజు, లోకేష్,లక్ష్మన్న,రంగన్న, దస్తగిరి,సుంకన్న, తదితరులు పాల్గొన్నారు.