PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

షోరూమ్ కు వెళ్లిన రైతుకు అవమానం.. తన సత్తా చూపిన రైతు !

1 min read

పల్లెవెలుగువెబ్ : కర్ణాటకలోని తుముకూరులో బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు వెళ్లిన రైతుకు సేల్స్ మెన్ నుంచి అవమానం ఎదురైంది. వాహనం కొనే స్థోమత నీకు లేదంటూ రైతును సేల్స్ మెన్ అవమానించాడు. బయటకు వెళ్లిపొమ్మన్నాడు. దీనిని ఛాలెంజ్ గా తీసుకున్న రైతు పది గంటలో పది లక్షలతో ప్రత్యక్షమయ్యాడు. రైతు కెంపెగౌడ బొలెరో పికప్ వాహనాన్ని కొనేందుకు తుముకూరులోని మహింద్రా షోరూంకి వెళ్లారు. సేల్స్ మెన్ రైతును అవమానిస్తూ ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నాడు. నీ వద్ద పది రూపాయలు ఉండవు.. పది లక్షల వాహనం ఎప్పుడు కొంటావు అంటూ విమర్శించారు. దీనిని అవమానంగా భావించిన రైతు గంటలో వస్తాను.. వెంటనే వాహనాన్ని డెలివరీ చేయగలరా అంటూ ఛాలెంజ్ విసిరాడు. చెప్పినట్టుగానే గంటలో 10 లక్షలతో ప్రత్యక్షమయ్యాడు. రైతు వద్ద డబ్బు చూసి సేల్స్ మెన్ కంగుతిన్నాడు. వాహనాన్ని వెంటనే డెలివరీ చేయలేమని షోరూమ్ నిర్వాహకులు చెప్పారు. దీంతో సేల్స్ మెన్ క్షమాపణలు చెప్పాలని రైతు స్నేహితులు డిమాండ్ చేశారు. షోరూమ్ నిర్వాహకులు క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. పోలీసులు రంగప్రవేశం చేసి రైతుకు క్షమాపణలు చెప్పించారు.

      

About Author