ఏలూరు విచ్చేసిన రాష్ట్ర బిసి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా
1 min read
మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ,జిల్లా అధికారులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా పర్యటనలో భాగంగా ఏలూరు విచ్చేసిన రాష్ట్ర బిసి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏలూరు కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలుకు గురువారం విచ్చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ పూల మొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, డిపిఓ మల్లికార్జునరావు, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం. ముక్కంటి, ప్రభృతులు చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా కు పూల మొక్కలను అందించి మర్యాదపూర్వకంగా కలిశారు.



