PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేర్చిన ఘనత సీఎం జగనన్నదే

1 min read

ఘనమైన స్వాగతం పలికిన ఆలూరు మండల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు

సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేర్చిన ఘనత సీఎం జగనన్నదే

ఆలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి శ్రీ గౌరవ విరుపాక్షి

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు నియోజకవర్గ ఆలూరు కేంద్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ప్రజలందరికీ ఫలాలు అందించిన గొప్ప నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఆలూరు నియోజకవర్గ సమన్వకర్త  విరుపాక్షి  ఆలూరు పట్టణంలో కోయనగర్, మెయిన్ బజార్, మారెమ్మ కట్ట వీదులలో పర్యటిస్తూ ప్రతి గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు.రానున్న ఎన్నికల్లో ఆలూరు లో వైసీపీ జెండా రెపరేపలాడుతుందని ధీమా వ్యక్తంచేశారు.వైసీపీలోని ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పని చేస్తున్నారని,పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరినీ గుర్తించుకుంటానని చెప్పారు.తన విజయానికి అంతా సహకరించాలని కోరారు.ముందుగా గెస్ట్ హౌస్ నందు ఆలూరు నియోజకవర్గం బల్లూరు గ్రామానికి చెందిన 50 కుటుంబాలు  సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  చేస్తున్న సంక్షేమ పథకాలు ఆకర్షితులై టిడిపి పార్టీ నుండి ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ గౌరవ విరుపాక్షి  సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ,మండల కన్వీనర్ శ్రీ చిన్న ఈరన్న  మండల కో కన్వీనర్ శ్రీ వీరేష్ , వాల్మీకి రామాంజనేయులు  బెల్దోన సొసైటీ చైర్మన్ శ్రీ మల్లికార్జున ,ఎంపీపీ,వైస్ ఎంపీపీ,కో – ఆప్షన్ సభ్యులు, ఆలూరు సొసైటీ ఛైర్మన్ కిశోర్, ఎంపీటీసీలు, వార్డుసభ్యులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author